మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ 4 విజేత ఎవరో తేలనుంది... మళ్లీ ఆయనే ఇస్తారట...!
By: Anji Fri, 18 Dec 2020 3:43 PM
రెండు రోజుల్లో బిగ్ బాస్ 4 విజేత ఎవరో తేలనున్నారు. మూడో సీజన్ మాదిరిగానే అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20న కళ్లు చెదిరే ప్రాగ్రామ్స్ మధ్య జరగనున్నది.
ఐదుగురు ఫైనలిస్టులుగా అభిజీత్, అరియానా, సయ్యద్ సొహేల్, అఖిల్, హారిక ఈ గ్రాండ్ ఫినాలేలో విన్నర్స్ ట్రోఫీ కోసం భీకరంగా పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు విన్నర్ అవుతారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఓటింగ్ ఎక్కువగా పొందుతున్న అభిజీత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నా, సోషల్ మీడియాలో అతనికి అనుకూలంగా భారీ ప్రచారం జరుగుతున్నా.. అనూహ్యమైనది జరగవచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
గత మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే గెలవడంతో, ఈసారి బిగ్ బాస్ ఫిమేల్ కంటెస్టెంట్ను గెలిపిస్తాడంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి. అరియానా గ్లోరీకి వీక్షకుల ఓటింగ్ శాతం బాగా పెరిగిందనీ, ఆమె విజేతగా నిలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనీ వినిపిస్తోంది.
కాగా ఈ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్గా వచ్చిన విన్నర్ ట్రోఫీని అందించేదెవరంటూ జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్కు విన్నర్ ట్రోఫీని అందజేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సీజన్ ఫైనల్స్కూ గెస్ట్గా వస్తున్నారని ప్రచారంలోకి వచ్చింది.
నిజానికి సూపర్స్టార్ మహేశ్ బాబును నిర్వాహకులు సంప్రదించారనీ, కానీ ఆయన అనాసక్తి వ్యక్తం చేయడంతో మరోసారి చిరునే వారు ఆశ్రయించారనీ, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ చెప్పుకుంటున్నారు. నేడో, రేపో.. నిర్వాహకులు గెస్ట్ విషయం అఫిషియల్గా అనౌన్స్ చేయనున్నారు.