Advertisement

  • థియేటర్లు ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ..మెగా హీరో సాయి ధరమ్ తేజ్

థియేటర్లు ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ..మెగా హీరో సాయి ధరమ్ తేజ్

By: Sankar Fri, 04 Dec 2020 10:29 AM

థియేటర్లు ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ..మెగా హీరో సాయి ధరమ్ తేజ్


ఏడాది క్రితం వరకు కొత్త సినిమా అంటే థియేటర్లోనే చూడాలి ..కానీ ఇప్పుడు ఆలా కాదు కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని మారిపోయాయి ...థియేటర్లు మూతపడ్డాయి..సినిమాలు కూడా మెల్లగా ఆన్లైన్ ప్లాట్ఫారం లలో రిలీజ్ అయ్యేందుకు అలవాటుపడ్డాయి ..అయితే ఆన్లైన్ లో చేసినదానికి , థియేటర్లో చుసిన దానికి తేడా చాల ఉంటుంది..అందుకే సినీ పరిశ్రమతో పటు సామాన్య అభిమానులు కూడా థియేటర్లు త్వరగా ఓపెన్ అవ్వాలని కోరుకున్నారు..

కరోనా నిబందనలతో థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఎప్పటి నుంచి థియేటర్లను తెరుచుకోవాలన్న సందిగ్ధంతో థియేటర్ల యజమానుల ఉన్నారు. ఇటీవల ఏఎంబీ చేసిన ప్రకటన ద్వారా థియేటర్ల ఓపెంనింగ్ కన్ఫూజన్‌కు తెరపడింది.దాంతో నేటి నుంచి థియేటర్ల తాళాలు తెరుచుకోనున్నాయి..

థియేటర్ల ఓపెనింగ్ పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు..థియేటర్లలో సినిమా చూస్తే ఆ అనుభవమే వేరన్నాడు. ‘తిరిగి థియేటర్లను చూడటం చాలా ఆనందాంగా ఉంది. పెద్ద తెరపరపై సినిమాను చూసే అనుభవాన్ని మళ్లీ పొందడం ఇంకా కొత్తగా ఉంది. దాదాపు అందరూ అదేవిధంగా ఫీల్ అవుతున్నారు. ఈ నాటి నుంచి మళ్లీ సినిమాల విడుదలను వేడుకగా జరుపుకుందామ’ని అన్నాడు. తన ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జోడించాడు.

Tags :

Advertisement