సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక పెళ్లి...!
By: Anji Sun, 06 Dec 2020 1:25 PM
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్ పూర్లోని కోటలో అంగరంగ వైభవంగా జరగనుంది.
డిసెంబర్ 9న జరగబోయే ఈ వేడుక కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మినహాయిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు.
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అదిరిపోతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక అక్కలు..చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిరు పెద్ద కూతురు సుష్మిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. సుష్మిత, శ్రీజతో కలిసి కొత్త పెళ్లికూతురు నిహారిక దిగిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను బాగా అలరిస్తుంది.