‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’
By: chandrasekar Sat, 12 Sept 2020 12:19 PM
‘సోలో బ్రతుకే సో బెటర్’ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా
షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. ‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా
కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
చివరిరోజు చిత్ర
సభ్యులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వీడ్కోలు పలికారు. యూనిట్
సభ్యులందరూ తమ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.
హీరో సాయి ధరమ్తేజ్ కూడా
ఈ సినిమా షూటింగ్లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ షేర్
చేసాడు. రెండ్రోజుల క్రితమే తన మేకప్మేన్లతో దిగిన ఫోటోను షేర్ చేసిన తేజ్ శుక్రవారం షూటింగ్ పూర్తయిందంటూ ట్వీట్ చేశాడు.
‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా
షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని
షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా
సరదాగా గడిచిపోయిదంటూ’ సాయి ధరమ్ తేజ్ యూనిట్తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.