Advertisement

  • ప్రముఖ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ సీసన్ 4 లో పాల్గొనవచ్చని సోషల్ మీడియాలో వైరల్

ప్రముఖ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ సీసన్ 4 లో పాల్గొనవచ్చని సోషల్ మీడియాలో వైరల్

By: chandrasekar Wed, 19 Aug 2020 4:01 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ సీసన్ 4 లో పాల్గొనవచ్చని సోషల్ మీడియాలో వైరల్


ప్రముఖ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ సీసన్ 4 లో పాల్గొనవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడ్డ బిగ్ బాస్ సీసన్ 4 త్వరలోనే స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 4వ సీజన్లో అడుగు పెట్టబోతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. జూన్ చివరి వారంలోనే ప్రారంభం కావలసిన ఈ షో కరోనా కారణంగా ఆలస్యం అయింది. జూలై 20న నిర్వాహకులు బిగ్ బాస్ 4 లోగోను ఆవిష్కరించారు. తాజాగా బిగ్ బాస్ 4 టీజర్‌ని కూడా విడుదల చేశారు.

బిగ్ బాస్ 4 కు ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ 4 రియాలిటీ షో కోసం అద్భుతమైన బిగ్ బాస్ హౌజ్ దిద్దుకుంటోంది. కానీ ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయాన్ని బిగ్ బాస్ టీం ఎప్పటిలాగే అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఇందులో పాల్గొనే ఆ 15 మంది ఎవరెవరా అనే ఊహాగానాలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీటిపై వైరల్ టాక్ వస్తూ ఉంటుంది.

ప్రస్తుతం అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన టాక్ ప్రకారం ప్రముఖ కొరియోగ్రాఫర్ 'జానీ' మాస్టర్ బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌లో ఒకరు అని తెలుస్తోంది. గత సంవత్సరం, ప్రముఖ కొరియోగ్రాఫర్, బాబా మాస్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం, 4వ సీజన్లో నాగార్జున హోస్ట్ చేయబోయే ఈ షో కోసం బిగ్ బాస్ 4 నిర్వాహకులు జానీ మాస్టర్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమని మరియు మిగిలిన వారు ఎవరు పాల్గొంటున్నారని తెలియాల్సివుంది.

Tags :
|

Advertisement