Advertisement

  • హిమాలయాకు వెళ్లిన నాగార్జున ..ఎందుకో తెలుసా !

హిమాలయాకు వెళ్లిన నాగార్జున ..ఎందుకో తెలుసా !

By: Sankar Fri, 23 Oct 2020 11:22 PM

హిమాలయాకు వెళ్లిన నాగార్జున ..ఎందుకో తెలుసా !


గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. దియా మీర్జా - సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది . ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఇక ఈ సినిమామిగిలిన భాగాన్ని హిమాలయాల్లో షూట్ చేయనున్నారు .

'వైల్డ్ డాగ్'' షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల పర్వతాల్లో జరుగుతున్నట్లు నాగార్జున వెల్లడించారు. తాజాగా రోహతంగ్ పాస్ లో తీసిన ఓ వీడియోను కింగ్ నాగ్ ట్విటర్ లో షేర్ చేశారు. ''ఈ అందమైన పర్వతాలు - వాటర్ ఫాల్స్ - బ్లూ స్కై మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్ చాలా చాలా బాగా జరుగుతోంది. ఏడూ నెలలతర్వాత ఇలా బయటకు రావడం చాలా ఆనందంగా ఉందని నాగ్ తెలిపారు.

Tags :

Advertisement