Advertisement

  • లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా ఖుష్బూ

లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా ఖుష్బూ

By: chandrasekar Wed, 01 July 2020 7:36 PM

లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా ఖుష్బూ


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకాక ముందే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో పోయిన ఏడాది వచ్చిన 'లూసిఫర్' అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది.

ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను ప్రభాస్‌తో 'సాహో' వంటీ భారీ సినిమా తీసి తన సత్తా చాటుకున్న యువకుడు సుజీత్ డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగు వర్షన్‌లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగు వెర్షన్ లో చిరు చేస్తుండగా కథలో భారీ మార్పులే జరుగుతున్నాయట.

టాలీవుడ్ చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే.

మొన్నటి వరకు తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఆ పాత్రలో అందాల ఖుష్బూ నటించనుందని తెలుస్తోంది. ఖుష్బూ గతంలో స్టాలిన్ సినిమాలో కూడా ఆయనకు సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Advertisement