Advertisement

  • హల్ చల్ చేస్తున్న కేజీఎఫ్-2 క్లైమాక్స్‌ సీను

హల్ చల్ చేస్తున్న కేజీఎఫ్-2 క్లైమాక్స్‌ సీను

By: chandrasekar Sat, 30 May 2020 5:50 PM

హల్ చల్ చేస్తున్న కేజీఎఫ్-2 క్లైమాక్స్‌ సీను


కేజీఎఫ్ సినిమాతో సక్సెస్ ఫుల్ జోష్ మీద ఉన్న యష్ దానికి సీక్వెల్‌గా పార్ట్ 2 తీస్తున్నాడు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా ఫెస్టివల్ కి సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే కేజీఎఫ్‌2 క్లైమాక్స్. కేజీఎఫ్2 క్లైమాక్స్ విషయంలో ఆసక్తికర వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. క్లైమాక్స్ విషాదంతంగా ఉంటుందని సమాచారం. కేజీఎఫ్ ఫస్ట్ ఛాప్టర్‌లో విలన్ అధీరాను రాఖీ చంపేస్తాడు. ఆ తర్వాత అతడే ఆ బంగారు గనులకు బాద్‌షా అయిపోతాడు. అయితే పార్ట్ 2లో మాత్రం హీరో క్లైమాక్స్‌లో చనిపోతాడని తెలుస్తోంది. దీంతో క్లైమాక్స్ విషాదంతం అవుతుందని ప్రచారం జరుగుతోంది.

కేజీఎఫ్2 పార్ట్ టులో దేశ ప్రధాని పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్న విషయం తెలిసిందే. క్లైమాక్స్‌లో రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని తెలుస్తోంది. పార్ట్ 1లో పేదరికం నుంచి పుట్టిన హీరో బతికినన్ని రోజులు ధనవంతుడిగా బతకాలని తన తల్లి అడగడంతో మాటిస్తాడు. బంగారు గనుల్ని శాసించే స్థాయికి వస్తాడు రాఖీ భాయ్. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం చచ్చిపోయేటప్పుడు ధనవంతుడిగానే రాఖీ చచ్చిపోతాడని అలా కెజియఫ్ కథ అంతమైపోతుందని ప్రచారం జరుగుతుంది.

kgf two,climax,scene,hull,chal ,హల్, చల్, చేస్తున్న, కేజీఎఫ్-2, క్లైమాక్స్‌ సీను


కేజీఎఫ్2లో యష్‌కు ధీటుగా విలన్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి పాత్రలకు కూడా సినిమాలో సేమ్ స్పేస్ ఉంది. దీంతో ఇప్పుడు విలన్ల చేతిలోనే రాఖీ భాయ్ చనిపోతాడా ? అన్న వార్తలతో యష్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే కేజీఎఫ్2 విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. అక్టోబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాళంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది.

ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రశాంత్. మరోవైపు కరోనా లాక్‌డౌన్ తర్వాత కేజీఫ్ చాప్టర్ 2 పనులు వేగం పెరిగింది. సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని కన్నడ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనుల్లో సాంకేతిక నిపుణులు బిజీగా మారిపోయారు. ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటడంతో కేజీఎఫ్ టీమ్ తమ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

Tags :
|
|
|

Advertisement