Advertisement

  • కమల్ సరసన కీర్తి సురేష్.. ఆ హిట్ సినిమా సీక్వెల్‌ కోసం..

కమల్ సరసన కీర్తి సురేష్.. ఆ హిట్ సినిమా సీక్వెల్‌ కోసం..

By: chandrasekar Thu, 23 July 2020 5:21 PM

కమల్ సరసన కీర్తి సురేష్.. ఆ హిట్ సినిమా సీక్వెల్‌ కోసం..


'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమా ఇచ్చిన పాపులారిటీతో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్నిదక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే విజయ్, విక్రమ్‌, సూర్య, పవన్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన కీర్తి తాజాగా రజనీకాంత్‌ సరసన 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తోంది.

ఇక సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాటలో కూడా హీరోయిన్’గా కీర్తి ఎంపికైన విషయం తెలిసిందే. అది అలా ఉంటే కీర్తి మరో అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం అందుతోంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 2006లో విడుదలైన 'రాఘవన్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోయే సినిమాలో కమల్‌ సరసన కీర్తి నటించనుందని తెలుస్తోంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందబోయే 'రాఘవన్‌' సీక్వెల్‌కి గౌతమ్‌ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఆయనే ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించబోతున్నాడు. ఇక కీర్తి తెలుగులో వరుసగా సినిమాలు అంగీకరిస్తూ వస్తోంది. తాజాగా గోపీచంద్‌ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించబోతున్న సినిమా 'అలివేలుమంగ వేంకటరమణ'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన కీర్తి సురేష్ నటించనుంది.

ప్రస్తుతం కీర్తి నితిన్ హీరోగా వస్తోన్న రంగ్ దేలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవర్ పేటలోను కీర్తి నటించనుందని సమాచారం. ఇక ఈ భామ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెంగ్విన్ కరోనా కారణంగా ఇటీవల ఓటీటీలో విడుదలై పరవాలేదనిపించింది. దీంతో ఆమె నటించిన మరో రెండు సినిమాలు ఇదే బాట పట్టనున్నాయి. 'మిస్‌ ఇండియా', 'గుడ్‌ లక్‌ సఖీ' చిత్రాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్‌ కాబోతున్నాయని సమాచారం. అలా కీర్తి వరుస సినిమాలతో అటూ లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు, ఇటూ అగ్ర హీరోల సరసన నటిస్తోన్నది.

Tags :
|
|

Advertisement