Advertisement

  • నిర్మాతల శ్రేయస్సు కొరకు పారితోషకం తగ్గించుకుంటా అంటున్న స్టార్ హీరోయిన్

నిర్మాతల శ్రేయస్సు కొరకు పారితోషకం తగ్గించుకుంటా అంటున్న స్టార్ హీరోయిన్

By: Sankar Thu, 18 June 2020 12:25 PM

నిర్మాతల శ్రేయస్సు కొరకు పారితోషకం తగ్గించుకుంటా అంటున్న స్టార్ హీరోయిన్



రాబోయే కాలంలో చేయబోయే చిత్రాలకు పారితోషికం తగ్గించి తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కీర్తీ సురేశ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. చిత్రీకరణలు స్తంభించాయి. ఇప్పుడిప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకొని కొందరు చిత్రీకరణలు ప్రారంభించారు. అయితే ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు , ప్రతి ఒక్కటి చాల జాగ్రత్తగా చూసుకొని చేయాలి దీనితో నిర్మాతలకు ఖర్చు ఎక్కువ అవుతుంది ..

ఈ నేపథ్యంలో నిర్మాతల శ్రేయస్సు కోరుతూ... స్వచ్ఛందంగా పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధమని కీర్తీ సురేశ్‌ ప్రకటించారు. ‘‘నిర్మాతలు ఈ క్లిష్ట పరిస్థితులు అధిగమించడానికి చిత్రసీమలో ప్రతి ఒక్కరూ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఓ కుటుంబంలా ఉండాలి. ఇకపై చేయబోయే సినిమాలకు నా పారితోషికంలో 20-30 శాతం తగ్గించి తీసుకోవడానికి నేను సిద్ధమే’’ అని కీర్తీ సురేశ్‌ అన్నారు.

కీర్తి నిర్ణయంపై పలువురు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి నటించిన `పెంగ్విన్` చిత్రం ఈ నెల 19 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కీర్తి చేతిలో ప్రస్తుతం `గుడ్ లక్ సఖి`, `రంగ్ దే`, `మిస్ ఇండియా`, `అన్నాత్తే`, `మరక్కర్` చిత్రాలు ఉన్నాయి. మహేష్ `సర్కారు వారి పాట` కోసం కూడా కీర్తిని సంప్రదించినట్టు సమాచారం. మహానటి సినిమాలో అద్భుత నటనతో నేషనల్ అవార్డు గెలుచుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన కీర్తి సురేష్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు ..అయినా కూడా తన పారితోషకం తగ్గించుకోవడం నిజంగా హర్షించతగ్గ విషయం

Tags :
|

Advertisement