37 వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ ..
By: Sankar Fri, 17 July 2020 10:34 AM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 37 వ వసంతంలోకి అడుగుపెట్టింది..ఈ సందర్బంగా ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సహచరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై మూవీలోని దిల్ దియా గలన్ అనే పాటలోని స్టిల్ను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే కత్రినా అని విషెస్ తెలిపాడు.
ఇక దీపికా పదుకొణే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కత్రినా కైఫ్కి బర్త్డే విషెస్ తెలియజేసింది. హ్యాపీ బర్త్డే కత్రినా..నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని దీపిక పేర్కొంది. కాగా, కత్రినా కైఫ్ లాక్డౌన్ సమయంలో ఇంటి పనులు చేస్తూ వాటికి సంబంధించి వీడియోలు షేర్ చేసి ఫ్యాన్కి థ్రిల్ కలిగించింది. ఒకానొక సందర్భంలో కత్రినా గిన్నెలు కడిగి ఆ వీడియో కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే.
కాగా తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమాలో నటించిన కత్రినా ఆ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసింది ..తొలుత సినిమాలు సరిగా ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ను సంపాదించింది ..దాదాపు దశాబ్దం పైగానే కత్రినా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ..ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ సరసన సూర్యవంశి సినిమాలో నటిస్తున్నారు ..దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు ..