Advertisement

  • 'ఖైదీ' బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ గా కత్రీనా

'ఖైదీ' బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ గా కత్రీనా

By: chandrasekar Tue, 18 Aug 2020 09:09 AM

'ఖైదీ' బాలీవుడ్  రీమేక్ లో హీరోయిన్ గా కత్రీనా


వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించి తెలుగుతెరకు పరిచయమైంది కత్రినా కైఫ్. తర్వాత బాలకృష్ణ సరసన నటించిన 'అల్లరి పిడుగు' ఫ్లాప్ అయింది. దీంతో తెలుగులో మరే సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం అమ్మడు అదరగొడుతోంది. అయితే ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేక పోతున్నాయి. కానీ, కత్రినా అందానికి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు సినిమాకు మంచి విజయాన్ని అందించాయి.

'ఖైదీ' సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఆయన ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్’తో మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా విడుదలకు కాలేదు. అది అలా ఉంటే ఖైదీ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగణ్ హీరోగా నటించనున్నాడు.

ఒరిజనల్ తమిళ 'ఖైదీ'లో హీరోయిన్ రోల్ ఉండదు. కానీ హిందీలో కొన్ని మార్పులతో పాటు చేర్పులు చేయబోతున్నారు. అందులో భాగంగా హిందీ ఖైదీలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారట. అయితే ఆ పాత్ర కోసం అందాల తార కత్రినా కైఫ్ ను తీసుకుంటున్నట్లు వినికిడి. ఈ హిందీ ఖైదీని కూడా లోకేష్ కనకరాజే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ చేయవచ్చు.

Tags :
|

Advertisement