- హోమ్›
- వినోదం›
- బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ చైనా ఫోన్ ఒప్పదం నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు ..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ చైనా ఫోన్ ఒప్పదం నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు ..
By: Sankar Fri, 10 July 2020 5:45 PM
ఇండియా చైనా సంఘర్షణలలో ఇరవై మంది భారతీయ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే ఆ తర్వాత భద్రత కారణాల దృష్ట్యా చైనాకు చెందిన యాప్స్ ను కేంద్రం నిషేదించింది ..దీనితో చైనాకు చెందిన యాప్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేయొద్దు అని సెలెబ్రిటీలను ప్రజలు కోరిన విషయం తెలిసిందే ..అయితే తాజాగా బాలీవుడ్ నటుడు ఒకరు చైనా కంపెనీ కి తనతో ఉన్న డీల్ రద్దు చేసుకున్నాడు అని అతడి ఫాన్స్ చెబుతున్నారు ..అతడే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్..
కార్తీక్ ఇంతకుముందు చైనా మొబైల్ కంపెనీ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేవాడు. అయితే భారత్ -చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీస్ కంపెనీలతో ఇదివరకే కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కార్తీక్ తాజా పోస్టులను బట్టి ఫ్యాన్స్ దీన్ని కన్పర్మ్ చేసేశారు.
తాజాగా నటుడు కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాపిల్ మొబైల్ ఫోన్తో ఓ ఫోటోను షేర్ చేశాడు. తన ఇంట్లో కిటీకీ దగ్గర నిలబడి మేఘాలను తన మొబైల్లో ఫొటో తీస్తున్న చిత్రం అది. అయితే కార్తిక్ పట్టుకున్న ఫోన్ ..ఐ ఫోన్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ చైనా ఫోన్కి ప్రచారాన్ని వదిలేశాడని అతని ఫొటో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో మిగతా హీరోలు కూడా చైనా మొబైల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.