డ్రగ్స్ కేసు పై స్పందించిన కరణ్ జోహార్..!
By: Anji Sat, 26 Sept 2020 6:25 PM
ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్ కేసులో తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేరు తెరమీదకు వచ్చింది. ఇద్దరు డ్రగ్ సరఫరాదారులకు కరణ్ జోహార్ కు సంబంధం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గత ఏడాది జులై 28న కరణ్ ఇంట్లో డ్రగ్స్ వాడినట్లుగా వార్తలు వచ్చాయి. డ్రగ్స్ సరఫరాదారులుగా ఎన్సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాలు కరణ్ కు అత్యంత సన్నిహితులని మీడియాలో కథనాలు రావడం కలకలం రేపింది.
ఇక ఈ వార్తలపై తాజాగా స్పందించాడు కరణ్ జోహార్. ఆ ఇద్దరితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. క్షితిజ్ ప్రసాద్ మా సంస్థలో ఓ ప్రాజెక్ట్ కోసం గత ఏడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాడని చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని.. అంతకుమించి ఆ వ్యక్తులతో వారి వ్యక్తిగత జీవితాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఇక తన ఇంట్లో జరిగిన పార్టీలో కూడా అసలు ఎలాంటి డ్రగ్స్ వాడలేదని కరణ్ జోహార్ తెలియచేసాడు.