20 కిలోల బరువు పెరిగిన కంగనా...?
By: chandrasekar Thu, 15 Oct 2020 6:39 PM
దివంగత తమిళనాడు సీఎం, నటి జయలలిత
బయోపిక్ లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్
నటిస్తున్న విషయం తెలిసిందే. తలైవి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా
షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ
ముందుండే కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది.
జయలలిత పాత్రలాగా
కాస్త లావుగా కనిపించడం కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగిందట. ఈ విషయాన్ని ట్విటర్
ద్వారా తెలిపి౦ది. ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన కంగనా
తలైవి కోసం నేను 20 కిలోల బరువు పెరిగాను.
ప్రస్తుతం సినిమా
షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఇక నా పాత లుక్ లో మారాల్సి ఉంది. అప్పటి
లుక్, చురుకుదనం, మెటాబాలిజాన్ని
అలవాటు చేసుకోవాలి. వేకువ జామునే నిద్రలేస్తున్నా
జాగింగ్, వాకింగ్
కు వెళ్తున్నా. నాతో ఎవరెవరున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది కంగనా. ఈ భామ
పోస్ట్ చేసిన ఫొటో ఇపుడు తెగ వైరల్ అవుతోంది.