- హోమ్›
- వినోదం›
- సుశాంత్ మరణంపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే నా పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా..కంగనా రనౌత్
సుశాంత్ మరణంపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే నా పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా..కంగనా రనౌత్
By: Sankar Sun, 19 July 2020 10:43 AM
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే లేపింది ..ఆయన మరణం తర్వాత బాలీవుడ్ రెండుగా విడిపోయింది ..ఒకవైపు బంధుప్రీతి , నేపోటిజం వల్లనే సుశాంత్ మరణించాడు అని అంటుంటే , ఇంకోవైపు అసలు బాలీవుడ్ లో నేపోటిజం అన్నదే లేదు అని అంటున్నారు ..ఏది ఏమైనా బాలీవుడ్ ఏ కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది ..అయితే సుశాంత్ మరణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను అన్నారు కథానాయిక కంగనా రనౌత్ ..
ఒకవేళ విచారంలో విచారణలో అవి తప్పని తేలితే ప్రభుత్వం నుంచి స్వీకరించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ బాలీవుడ్ అగ్ర కథానాయిక . సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో పరిశ్రమలోని పెద్దల వైఖరిపై ఆది నుంచి ధిక్కార గళాన్ని వినిపిస్తోంది కంగనారనౌత్. తీవ్రమైన ఒత్తిడి, అవకాశాలు రావనే అసంతృప్తితో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ ఘటన వెనక ఇండస్ట్రీ పెద్దల హస్తముందని కంగనారనౌత్ ఓ వీడియో ద్వారా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానల్తో మాట్లాడిన కంగనారనౌత్ పోలీస్ విచారణలో తన ఆరోపణలు తప్పని నిరూపితం అయితే పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది. కొద్దిరోజుల క్రితం ముంబయి పోలీసులు తనకు సమన్లు జారీ చేశారని.. ఆ సమయంలో స్వస్థలం మనాలిలో ఉండటం వల్ల బదులివ్వలేక పోయానని పేర్కొంది. ‘ఎవరైన పోలీస్ అధికారిని మనాలికి పంపిస్తే నా స్టేట్మెంట్ తీసుకోవచ్చని చెప్పాను. అయితే వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. పరిశ్రమలోని బంధుప్రీతి, పెద్దలు సృష్టించిన ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నది అందరికి తెలిసిన నిజం. ఈ అంశంలో ఎలాంటి పోలీస్ విచారణకైనా నేను సిద్ధమే’ అని కంగనారనౌత్ స్పష్టం చేసింది.