వరస సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్
By: chandrasekar Sat, 11 July 2020 11:00 AM
జూనియర్ ఎన్టీఆర్
సినిమాలు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ను కుమ్మేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈయన వరస
సినిమాలతో బిజీగా ఉన్నాడు. తారక్ లైనప్ చూస్తే ఎలాంటి హీరోకైనా కుళ్లు రాక తప్పదు.
ఎందుకంటే అలాంటి సినిమాలు ఇప్పుడు తారక్ చేతుల్లో ఉన్నాయి.
ప్రస్తుతం ఈయన రాజమౌళి RRR సినిమాతో
బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మరో ఏడాది పాటు బిజీగా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం
లేదు. 2021, జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుందని చెప్పారు. కానీ లాక్డౌన్
వల్ల ఆలస్యమైయ్యేలా ఉంది.
ఇదిలా ఉంటే రాజమౌళి
తర్వాత వరసగా స్టార్ డైరెక్టర్స్ను రంగంలోకి దించుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం జూనియర్ తర్వాత మూడు సినిమాలు మాత్రం
అగ్ర దర్శకులతోనే ఉండబోతున్నాయి.
ఇప్పటికే వరస విజయాలతో
దూసుకుపోతున్న ఈయన RRR తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాపై ప్రకటన కూడా వచ్చింది. ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది.
హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
దాంతో పాటు ప్రశాంత్ నీల్
దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. ఆ మధ్య మే 20న జూనియర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ ఈ విషయం
కన్ఫర్మ్ చేసాడు. కెజియఫ్ 2 తర్వాత ఇది కూడా ప్యాన్ ఇండియన్ లెవల్లో ఉండబోతుంది.
మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు జూనియర్
ఎన్టీఆర్. ఈ విషయాన్ని అట్లీ కుమార్ కూడా కన్ఫర్మ్ చేసాడు.
త్వరలోనే తెలుగు సినిమా
చేయబోతున్నానని అది కూడా తనకిష్టమైన ఎన్టీఆర్తో అని ఈ మధ్యే చెప్పాడు అట్లీ. ఇప్పటికే
తమిళనాట వరస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు.
అన్నీ కుదిర్తే అశ్వినీ దత్ బ్యానర్లోనే ఈ చిత్రం ఉండబోతుంది. కెరీర్ గ్రాప్
పడిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.
ఎందుకంటే గతంలో రాజమౌళితో
సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా
జూనియర్ కెరీర్ అంతా డైలమాలో పడిపోయింది. వరస ఫ్లాపులు ఈయన్ని బాగా ఇబ్బంది
పెట్టేసాయి. అందుకే ఇప్పుడు RRR
తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ, ప్రశాంత్
నీల్ లాంటి సంచలన దర్శకులతో పని చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు.