Advertisement

  • బుల్లి ఇంద్రసేనారెడ్డిగా నటించిన తేజ సజ్జ హీరోగా ఎంట్రీ

బుల్లి ఇంద్రసేనారెడ్డిగా నటించిన తేజ సజ్జ హీరోగా ఎంట్రీ

By: chandrasekar Mon, 24 Aug 2020 11:59 PM

బుల్లి ఇంద్రసేనారెడ్డిగా నటించిన తేజ సజ్జ హీరోగా ఎంట్రీ


బుల్లి ఇంద్రసేనారెడ్డిగా సూపర్ హిట్ మూవీ ‘ఇంద్ర’లో ‘నేనున్నానే నానమ్మ’ అంటూ మెప్పించిన తేజ సజ్జ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. తేజ సుమారు 50 సినిమాల్లో బాలనటుడిగా కనిపించి కిందటేడాది సమంత ‘ఓ బేబీ’ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా నటించాడు. ఇప్పుడు సోలో హీరోగా మారి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జాంబీ రెడ్డి’ సినిమా ద్వారా తేజ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అలాగే, తేజ హీరోగా మరో సినిమా కూడా వస్తోంది. ఈ సినిమాలో తేజ లుక్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్ర శేఖర్ మొగుల్ల, ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం మల్లిక్ రామ్ వహిస్తున్నారు.

ఈ సినిమా ఫాంటసీ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథ అందరికి నచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ, శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య, మిర్చి కిరణ్, దేవీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించారు.

Tags :
|
|

Advertisement