ఓటీటీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్న జాన్వీకపూర్ సినిమా
By: chandrasekar Wed, 10 June 2020 6:56 PM
సినిమా ఇండస్ట్రీ కరోనా కారణంగా మూత పడడంతో నిర్మించిన సినిమాలను ఓటీటీ ఫార్మాట్లో రిలీజ్ చేయదానికి సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ సినీ నిర్మాతలకు శాపంగా మారింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కొన్ని బాలీవుడ్ సినిమాలను ఓటీటీ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో జాన్వీకపూర్ ఫిల్మ్ కూడా చేరింది. శ్రీదేవి తనయి జాన్వీ నటిస్తున్న గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఇక ఆ మూవీ తెరకెక్కడమే తరువాయి. కానీ కరోనా వైరస్తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల సినిమా హాళ్లు అన్నీ బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో పైలట్ పాత్ర పోషిస్తున్న జాన్వీ కపూర్ సినిమా గుంజన్ సక్సేనా మూవీని కూడా ఓటీటీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ డిజిటల్ రిలీజ్కు సంబంధించిన ట్వీట్ చేశారు. గుంజన్ సక్సేనా సినిమాను శరన్ శర్మ డైరక్ట్ చేస్తున్నారు. జీ స్టూడియోస్ దీన్ని ప్రజెంట్ చేస్తోంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే ఓటీటీ ఫార్మాట్లో గులాబో సితాబో సినిమాను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ మూవీ రిలీజ్కు సంబంధించిన డేట్ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. యుద్ధానికి వెళ్లిన తొలి మహిళా వాయుసేన అధికారి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీతో పాటు అంగద్ బేడీ, మానవ్ విజ్, పంకజ్ త్రిపాఠి, రజత్ బర్మేచా, నీనా గుప్తా, విజయ్ వర్మలు కూడా నటిస్తున్నారు. ప్రజలు సినిమా విడుదలకు అతృతతో ఎదురుచూస్తున్నారు.