Advertisement

  • ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేయనున్న జాన్వీకపూర్‌ సినిమా

ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేయనున్న జాన్వీకపూర్‌ సినిమా

By: chandrasekar Wed, 10 June 2020 6:56 PM

ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేయనున్న జాన్వీకపూర్‌ సినిమా

సినిమా ఇండస్ట్రీ కరోనా కారణంగా మూత పడడంతో నిర్మించిన సినిమాలను ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేయదానికి సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ సినీ నిర్మాతలకు శాపంగా మారింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కొన్ని బాలీవుడ్ సినిమాలను ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో జాన్వీకపూర్‌ ఫిల్మ్‌ కూడా చేరింది. శ్రీదేవి తనయి జాన్వీ నటిస్తున్న గుంజన్‌ సక్సేనా ద కార్గిల్‌ గర్ల్‌ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయ్యింది. ఇక ఆ మూవీ తెరకెక్కడమే తరువాయి. కానీ కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్‌డౌన్‌ వల్ల సినిమా హాళ్లు అన్నీ బంద్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు.

ఇందులో పైలట్‌ పాత్ర పోషిస్తున్న జాన్వీ కపూర్‌ సినిమా గుంజన్‌ సక్సేనా మూవీని కూడా ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ డిజిటల్‌ రిలీజ్‌కు సంబంధించిన ట్వీట్‌ చేశారు. గుంజన్‌ సక్సేనా సినిమాను శరన్‌ శర్మ డైరక్ట్‌ చేస్తున్నారు. జీ స్టూడియోస్‌ దీన్ని ప్రజెంట్‌ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇప్పటికే ఓటీటీ ఫార్మాట్‌లో గులాబో సితాబో సినిమాను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం గుంజన్‌ సక్సేనా ద కార్గిల్‌ గర్ల్ మూవీ రిలీజ్‌కు సంబంధించిన డేట్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. యుద్ధానికి వెళ్లిన తొలి మహిళా వాయుసేన అధికారి గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీతో పాటు అంగద్‌ బేడీ, మానవ్‌ విజ్‌, పంకజ్‌ త్రిపాఠి, రజత్‌ బర్మేచా, నీనా గుప్తా, విజయ్‌ వర్మలు కూడా నటిస్తున్నారు. ప్రజలు సినిమా విడుదలకు అతృతతో ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement