జాన్వీ కపూర్ మూవీ ‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్
By: chandrasekar Fri, 17 July 2020 5:11 PM
లాక్ డౌన్తో మొన్నటి
వరకు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దీంతో సినిమా షూటింగ్స్తో పాటు థియేటర్స్
అన్ని మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన సినిమాల నిర్మాతలు సినిమాల కోసం
వడ్డీలు కట్టలేక తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కు మంచి రేటుకే అమ్ముకుంటున్నాయి.
తెలంగాణ, సహా
వివిధ ప్రభుత్వాలు షూటింగ్స్కు పర్మిషన్స్ ఇచ్చినా థియేటర్స్ ఓపెన్ చేయడానికి
మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకో రెండు మూడు నెలల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేలా
కనిపించింది. దీంతో చాలా మంది చిత్ర నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో
రిలీజ్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే జ్యోతిక
హీరోయిన్గా నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. అదే
బాటలో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఇక
బాలీవుడ్లో అమితాబ్, ఆయుష్మాన్ గులాబో సితాబో సినిమా కూడా ఓటీటీలో విడుదలైంది.
దీని వల్ల పలువరు
నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అదే బాటలో జాన్వీ కపూర్
హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ
‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్
మూవీ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈమె ఫస్ట్
ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్.
అంతేకాదు యుద్దంలో
పాల్గొన్న తొలి వనిత. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో ఆగష్టు 12 నుంచి
స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శరణ్ శర్మ డైరెక్ట్ చేసారు.