Advertisement

బిగ్ బాస్ 4 హౌస్‌లో జంబ‌ల‌కిడి పంబ...!

By: Anji Mon, 05 Oct 2020 4:00 PM

బిగ్ బాస్ 4 హౌస్‌లో జంబ‌ల‌కిడి పంబ...!

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు త‌మ ఎన‌ర్జీనంతా పెట్టి హోస్ట్ నాగార్జున ఇచ్చిన 'జంబ‌ల‌కిడి పంబ' టాస్క్‌లో వీర లెవ‌ల్లో త‌మ ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించారు. హౌస్‌లో ఆడ‌వాళ్లు, మ‌గ‌వాళ్లు స‌మాన‌మే అని చెప్ప‌డానికే ఇలా చేయించాన‌ని నాగ్ చెప్పారు. సోనాల్‌గా మారిన సొహైల్‌ను చూసి నాగ్ విజిల్ వేశారు. "చాలా బాగున్నావు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

అవ‌నిగా మారిన అవినాష్‌ను చూసి న‌వ్వు ఆపుకోడానికి ట్రై చేశారు. ర‌జ‌నిగా మారి అమ్మ రాజ‌శేఖ‌ర్ సిగ్గుప‌డ‌టం చూసి "మీరు సిగ్గుప‌డితే నేను ఇక్క‌డే చ‌చ్చిపోతా" అని ప‌డిప‌డి న‌వ్వారు. "ముత్యాలు వ‌స్తావా.." అంటూ గంగ‌వ్వ‌, కుమార్ సాయి చేసిన డాన్స్‌కు ఫిదా అయ్యారు. అవినాష్‌, హారిక చేసిన స్కిట్‌తో పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు. "మిమ్మ‌ల్ని ఇలా చూస్తుంటే రాత్రికి ఏం క‌ల‌లు వ‌స్తాయో ఏమో" అంటూ ఆట ప‌ట్టించారు.

హౌస్‌లో టాస్క్‌ల సంద‌ర్భంగా ఆడ‌వాళ్లు, మ‌గ‌వాళ్లు అంటూ కొన్ని ప‌రిమితులు విధించుకుంటూ గేమ్ ఆడుతున్నార‌నీ, అయితే హౌస్‌లో జెండ‌ర్ బ‌యాస్‌కు అవ‌కాశ‌మే లేద‌నీ, అంద‌రూ స‌మాన‌మే అనీ నాగ్ అన్నారు. దీన్ని ప్రాక్టిక‌ల్‌గా చూపించ‌డం కోసం ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్లుగా, మ‌గ‌వాళ్లు ఆడ‌వాళ్లుగా మారి 'జంబ‌ల‌కిడి పంబ' స్కిట్స్ వేసే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో నాగ్ వారి పేర్లు కూడా మార్చేసి ఫ‌న్నీగా పిల‌వ‌డం ఆక‌ట్టుకుంది.

మెహ‌బూబ్ "హాయ్ సార్" అంటూ ఒయ్యారాలు వొల‌క‌బోయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, "ఛీ కూర్చో" అంటూ ముద్దుగా క‌సిరారు కింగ్‌. మొద‌ట జంబ‌ల‌కిడి పంబ స్టైల్‌లోకి మారిపోయిన కంటెస్టెంట్లు హౌస్ నుంచి గార్డెన్ ఏరియాలోకి ర్యాంప్ వాక్ చేసుకుంటూ వ‌చ్చారు. వారి న‌డ‌క‌, ఒయ్యారాలు న‌వ్వులు పంచాయి. లాస్య‌-మెహ‌బూబ్‌, అఖిల్‌-మోనాల్‌, అభిజిత్‌-హారిక‌, అరియానా-సొహైల్ డాన్సుల‌తో ఆక‌ట్టుకున్నారు.

దివి-నోయ‌ల్‌, అవినాష్‌-హారిక‌, రాజ‌శేఖ‌ర్‌-సుజాత వేసిన స్కిట్స్ హాస్యాన్ని పంచాయి. ఆడ‌వాళ్ల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టంతో హారిక స్కిట్‌, డాన్స్‌.. రెండింటిలోనూ ప‌ర్ఫామ్ చేసింది. ఈ టాస్క్‌లో అరియానా, సుజాత‌, రాజ‌శేఖ‌ర్‌, కుమార్ సాయిల‌ను బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్స్‌గా ప్ర‌క‌టించారు నాగ్‌.

Tags :

Advertisement