"లూసిఫర్" రీమేక్ లో విజయశాంతి నటించనుందా?
By: chandrasekar Wed, 24 June 2020 5:38 PM
మోహన్లాల్ నటించిన
లూసిఫర్ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ
సూపర్హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా
నటించనున్నాడు. సాహో డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
లూసిఫర్ రీమేక్పై
ఇప్పటికే అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఈ చిత్రంలో అలనాటి అందాల నటి
సుహాసిని కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా చిరు క్రేజీ
ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. 90వ
దశకంలో హిట్ఫెయిర్గా నిలిచిన చిరంజీవి, విజయశాంతి ఈ చిత్రంతో మరోసారి సిల్వర్స్క్రీన్పై
మెరువనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే సుహాసిని, విజయశాంతిలను
లూసిఫర్ తెలుగు రీమేక్లో ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన
మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ను సిద్దం చేసే
పనిలో ఉన్నాడు సుజీత్.
మరోవైపు చిరంజీవి, కొరటాల
శివతో తీస్తున్న ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ పూర్తయితే
లూసిఫర్ చిత్రం సెట్స్పైకి వెళ్లడం నిర్ణయించినట్లే.