Advertisement

  • డేరింగ్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన పట్టాలెక్కబోతుంది

డేరింగ్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన పట్టాలెక్కబోతుంది

By: Sankar Tue, 23 June 2020 5:56 PM

డేరింగ్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన పట్టాలెక్కబోతుంది



తెలుగులో అప్పటివరకు ఉన్న హీరోయిజాన్ని తన డైరెక్షన్తో మరొక స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు పూరి జగన్నాథ్ ..హీరో అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది పూరి సినిమాలోని హీరో క్యారెక్టర్ ..ఒక ఇడియట్ , ఒక అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి , ఒక బద్రి , అల్ టైం ఇండస్ట్రీ హిట్ పోకిరి ఇలా ఒక్కో సినిమా ఒక్కో స్థాయిలో ఉంటుంది ..అయితే ఇటీవల కాలంలో తన పని అయిపోయింది అనుకున్న దశలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్ అనిపించాడు..దీనితో మల్లి వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయిన పూరి జగన్నాథ్ తాజాగా తన డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ ఒకటి విడుదల అయింది ..

జగనణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వరలోనే ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ మేరకు ఆయన స్టేట్‌మెంట్‌ను పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు, దీన్ని పాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కిస్తారట. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత ‘జనగణమన’ను పట్టాలెక్కిస్తారు. అయితే, ఈ మూవీలో హీరో ఎవరనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అయితే పోకిరి , బిజినెస్ మాన్ టైంలోనే పూరి ఈ జనగణమన సినిమాను మహేష్ తో తెరక్కెక్కిస్తాడు అని భావించారు కానీ ఎందుకో అది రూపుదాల్చలేదు ..మరి ఇప్పుడు ఏ హీరోతో పూరి ఆ సినిమాను తీస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Tags :

Advertisement