Advertisement

  • సన్నీలియోనీకి సంబంధించిన ఇంటరెస్టింగ్ టాపిక్స్

సన్నీలియోనీకి సంబంధించిన ఇంటరెస్టింగ్ టాపిక్స్

By: chandrasekar Wed, 02 Sept 2020 3:51 PM

సన్నీలియోనీకి సంబంధించిన ఇంటరెస్టింగ్ టాపిక్స్


సన్నీలియోనీ అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్రా. ఆమె కెనడాలోని సర్నియాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సిక్కు మతానికి చెందిన వారు. తల్లిది హిమాచల్‌ప్రదేశ్, తండ్రి ఢిల్లీకి చెందిన వారు. సన్నీ పుట్టక ముందే ఆమె తల్లిదండ్రులు కెనడాలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే సన్నీ అమెరికాకు వెళ్లారు. లియోనీ అనేది ఇటాలియన్ సర్‌నేమ్. తెరపై ఆమె పేరును సన్నీ లియోనీగా పెంట్‌హౌస్ మేగజైన్ వ్యవస్థాపకుడు బాబ్ గుకియోన్ మార్చాడు. అడల్ట్ చిత్రాల్లోకి రాకముందు పీడియాట్రిక్ నర్సు కావాలని శిక్షణ తీసుకుంది. సన్నీ టీనేజర్‌గా ఉన్నప్పుడు బేకరీతోపాటు, పలు సంస్థల్లో పనిచేసింది. అడల్ట్ మేగజైన్ పెంట్‌హౌస్‌ కవర్‌పేజీలో కనిపించిన తొలి భారతీయురాలిగా సన్నీ లియోనీ 2001లో రికార్డు సృష్టించింది. మార్చి 2001లో పెంట్‌హౌస్ పెట్ ఆఫ్ ది మంత్‌గా, 2003లో పెంట్‌హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్‌గా సన్నీ అవార్డు వచ్చింది. 2010లో టాప్ 12 మంది అడల్ట్ స్టార్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందింది. సన్నీ తొలి చిత్రం ‘ది గర్ల్ నెక్స్ట్ డోర్’. ఇందులో ఎమిలే హిర్ష్, ఎలిషా కుత్బర్ట్ ప్రధాన పాత్ర పోషించారు.

2011లో బిగ్‌బాస్ కార్యక్రమంతో భారత్‌లో బుల్లితెరకు పరిచయమైంది.అంతకుముందు 2005లో ఎంటీవీ అవార్డ్స్ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ రిపోర్టర్‌గా తొలిసారి సన్నీ లియోనీ కనిపించింది. 2005లో కునాల్ నటించిన ‘కలియుగ్’ చిత్రంతో సన్నీకి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది. కానీ ఆ సినిమాలో నటించేందుకుగానూ ఒక మిలియన్ డాలర్లు అడగడం వల్ల బాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైంది. ఏడేళ్ల తర్వాత రణ్‌దీప్ హూడా నటించిన ‘జిస్మ్ -2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో ప్రత్యేక పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సన్నీ. 2017లో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘PSV గరుడవేగలో 'డియ్యో డియ్యో' పాటలో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. భారత్‌లో 2017 సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల్లో ఆమె పేరు ముందు వరుసలో ఉంది. అంతేకాదు దశాబ్ద కాలంగా గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన భారతీయ నటీమణుల జాబితాలో 2016లో ఆమె పేరు ముందుంది.

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసిన తొలి బాలీవుడ్ నటి సన్నీ. డిజైనర్ అర్చనా కొచ్చర్ కోసం ఆమె 2016లో ర్యాంప్‌పై నడిచారు. సన్నీకి ఇటాలియన్ వంటకాలంటే ఇష్టం. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్‌ అంటే ముఖ్యంగా చాట్, సుషి వంటివి ఆమె చాలా ఇష్టంగా తింటుంది. సన్నీ భర్త డేనియల్ వెబర్ ఆమెకు బిజినెస్ మేనేజర్. దంపతులిద్దరూ 2017 జూలైలో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారి పేరు నిషా కౌర్ వెబర్. ఆ తర్వాత సరోగసి పద్ధతి ద్వారా వారికి ఇద్దరు కుమారులు 2018లో జన్మించారు. వారి పేర్లు నోవా , ఆశీర్ సింగ్ వెబర్. ప్లేబాయ్ ఎంటర్‌ప్రైజెస్ ఉపాధ్యక్షుడు మట్ ఎరిక్‌సన్‌తో గతంలో ఏడాదిపాటు సన్నీ డేటింగ్ చేసింది. అనంతరం 2008లో ఇద్ధరూ విడిపోయారు. ఆ తర్వాత కమెడియన్ రస్సెల్ పీటర్స్‌తో చాలారోజులు డేటింగ్‌లో ఉంది. ‘మేం ఇద్దరం స్నేహితులం. చాలా కాలంపాటు మా మధ్య స్నేహం కొనసాగింది. కొంత కాలం డేటింగ్ కూడా చేశాం. కానీ అది తప్పు అనేది నా భావన’ అంటూ 2014లో హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ చెప్పింది. సన్నీకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఏ దేశానికి వెళ్లినా కొని వెంట తెచ్చుకుంటుంది. ‘ నాకు అత్యంత ఇష్టమైన ఆహారం చాక్లెట్లే’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం కలిగి ఉన్న సన్నీ.. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ ప్రకటన కోసం ఈ ఫోజిచ్చింది. క్రియాశీలక ప్రచారంలో పాల్గొనడం ద్వారా అమెరికన్ కేన్సర్ సొసైటీకి విరాళాలు కూడా సేకరించింది. బీబీసీ రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన టాప్ 100 మహిళల జాబితాలో సన్నీకి 2016లో చోటు దక్కింది. సన్నీ లియోనీకి సొంతంగా మొబైల్ యాప్ ఉంది. 2016లో ఆ యాప్‌ను విడుదల చేశారు. అభిమానులు ఆ యాప్‌ ద్వారా సన్నీతో మాట్లాడొచ్చు, సన్నీలియోనీకి సిగ్గు ఎక్కువ. ఎవరితో అయినా మాట్లాడాలంటే భయపడేది. కానీ దాన్నుంచి షారుఖ్ ఖాన్ బయటపడేశాడని సన్నీ గతంలో తెలిపింది. ఇతరులతో ఎలా కలిసి పోవాలి, ఎలా మాట్లాడాలి అనేది రయీస్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తెలుసుకోగలిగా. మొదట్నుంచి నాకు చాలా సిగ్గు. ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోయేదాన్ని. కానీ కొత్తవారితో ఎలా కలిసిపోవాలి, మాట్లాడాలి అనేది షారుఖ్ ఖాన్ వల్లే నేర్చుకున్నా. ఆ విషయంలో షారుఖ్ సాయం చేశాడు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సన్నీకి ఇష్టమైన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వూలో చెప్పింది. ’ నాకు ఇష్టమైన వ్యక్తి ధోని. అతనిలానే ఆయనకు అందమైన కూతురు ఉంది. ధోని తన కూతురుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసినప్పుడు చూశా. పాప చాలా క్యూట్‌గా ఉంది. ఆయన ఫ్యామిలీ మ్యాన్. అందుకే నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ ఆయన’

Tags :
|

Advertisement