Advertisement

పుకార్లను పట్టించుకోను ....సురేఖా వాణి

By: chandrasekar Mon, 17 Aug 2020 10:11 PM

పుకార్లను పట్టించుకోను ....సురేఖా వాణి


తన నటనతో అందరినీ ఆకట్టుకోగల నటి. ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసినదే. తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్ట్లో పోస్ట్ చేయగా అవి వైరల్ కూడా అయ్యాయి. ఇన్ స్టా గ్రామ్ లో సురేఖా వాణి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే సోషల్ మీడియాలో లింకప్ రూమర్స్ పై సురేఖా వాణి విసుగుచెంది,అనవసరమైన పుకార్లను పట్టించుకోవడం కూడా మానేశానంటోంది.

సురేఖా వాణి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...పుకార్లు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయని, ఆన్ లైన్ లో ఎవరైనా కథనాలు సృష్టించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సున్నితంగా హెచ్చరించారు. సురేఖా వాణి కూతురు సుప్రిత త్వరలోనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

Tags :
|
|

Advertisement