నా లోపాల్ని సరిదిద్దుకొని నన్ను నేను తెరపై కొత్తగా చూడాలనుకున్నా!
By: chandrasekar Wed, 26 Aug 2020 12:31 PM
బాలీవుడ్ యువ నాయకి జాన్వీకపూర్ వెండితెరపై అరంగేట్రం చేసిన తొలినాళ్ల నుంచే నటనాపరంగా తనపై ఎన్నో విమర్శలొచ్చాయని.. అయినా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన ‘గుంజన్ సక్సేనా’ చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా జాన్వీకపూర్ మాట్లాడుతూ
రెండేళ్ల క్రితం నా తొలి చిత్రం ‘ధడక్' విడుదలైంది. ఆ సినిమాలో నా నటన బాగోలేదని, కథానాయికగా పనికిరానని విమర్శలు చేశారు. మా అమ్మ బ్రతికి ఉంటే నా నటన చూసి బాధపడేదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా నేను మానసికంగా కృంగిపోలేదు.
నా లోపాల్ని సరిదిద్దుకొని నన్ను నేను తెరపై కొత్తగా చూడాలనుకున్నా. ‘గుంజన్ సక్సేనా’ చిత్ర సమీక్షల్లో నా నటన అద్భుతంగా ఉందని చాలా మంది మెచ్చుకున్నారు. అవి చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు ఎంత ముఖ్యమైనవో తొలిసారిగా తెలిసొచ్చింది. అమ్మ బ్రతికి ఉంటే ఈ సినిమా చూసి ఎంతో ఆనందించేది. నా విజయం గురించి అందరికి చెప్పేది. విమర్శల్ని పాజిటివ్గా తీసుకున్నాను కనుక ఈ రోజు విజయం సాధించగలిగాను’ అని చెప్పింది జాన్వీకపూర్. భారతీయ తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని తెరకెక్కించారు.