కోవిడ్ కారణంగా చాలా నష్టపోయాను....
By: chandrasekar Mon, 14 Dec 2020 8:35 PM
రీతూ వర్మ ‘పెళ్లి
చూపులు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్ సల్మాన్తో
చేసిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాతో ఘనవిజయం అందుకున్న రీతూ తమిళ హీరో విక్రమ్తో ‘ధృవ నచ్చత్తిరమ్’, నానితో
‘టక్ జగదీష్’ చిత్రాలతో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ హ్యాపీగా ఉంది.
ప్రస్తుతం తెలుగుతో పాటు
తమిళం, మలయాళం
సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా తాను చాలా
నష్టపోయానని అంటోంది. ‘ఈ ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్లతో బిజీ బిజీగా
గడిచిపోయింది. నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ఈ ఏడాది విడుదల కావాల్సినవే.
‘కనులు కనులు దోచాయంటే’ సినిమా సూపర్ హిట్ కావడంతో నా
సంతోషానికి అడ్డే లేకుండా పోయింది. ఏడాది చివరి రోజు వరకు ఈ ఆనందం కొనసాగుతుందని
చాలా ఆశలు పెట్టుకున్నాను. అప్పుడు అయితే కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా
పడ్డాయి. కోవిడ్ కారణంగా చాలా నష్టపోయాను’ అని అంటోంది రీతూ.