ముంబయిలోని తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైటర్...!
By: Anji Sat, 05 Dec 2020 12:52 PM
హిందీ టీవీ రంగంలో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ టీవీ సీరియల్స్కు రైటర్గా పనిచేసిన అభిషేక్ మక్వానా ఆత్మహత్మ చేసుకున్నారు.
ముంబయిలోని తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్న సూసైడ్ నోట్లో రాశారు.
కరోనా కారణంగా ఎంటర్టైన్మెంట్ రంగం కుదేలు కావడంతో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి తన వద్ద డబ్బుల్లేవని అభిషేక్ లేఖలో పేర్కొన్నారు.
దీనికి తోడు తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన లేఖలో రాశారు.
Tags :