విరాట పర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ రిలీజ్...!
By: Anji Mon, 14 Dec 2020 1:12 PM
తాజాగా రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నీది నాది ఒకే కథ ఫిలిం దర్శకుడు వేణు దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
రానా పుట్టిన రోజును పురస్కరించుకుని.. విరాట పర్వం నుంచి ఆయన లుక్ను విడుదల చేశారు. రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా 'విరాటపర్వం' మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో నక్సలైట్ వేషధారణలో గన్ చేతబట్టి నడుచుకుంటూ వస్తోన్న రానా కనిపిస్తున్నాడు. కళ్లలోని తీక్ష్ణత ఆయన పాత్ర తీరును తెలియజేస్తోంది.
"రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనే క్యాప్షన్ 'విరాటపర్వం' థీమ్ను పట్టిస్తోంది. రానా లుక్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆయన ఫ్యాన్స్ ఆ లుక్ను షేర్ చేస్తూ, బర్త్డే విషెస్తో ట్విట్టర్ను ముంచెత్తుతున్నారు.
అల్లు అర్జున్, రవితేజ, నాగబాబు, నాని, డైరెక్టర్ బాబీ సహా పలువురు సినీ సెలబ్రిటీలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ దగ్గుబాటి అందగాడికి శుభాకాంక్షలు తెలియజేశారు. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న 'విరాటపర్వం'లో సాయిపల్లవి నాయికగా నటిస్తోంది.
విశేషమేమంటే.. పోస్టర్స్లో మొదట ఆమె పేరు, తర్వాత రానా పేరు వేస్తుండటం! రానా సూచన మేరకే మేకర్స్ ఆమెకు టైటిల్స్లో ప్రాధాన్యమిస్తున్నారు. స్త్రీపురుష సమానత్వానికి రానా ఇస్తున్న ప్రాధాన్యం చూసి సాయిపల్లవి సైతం ఆశ్చర్యపోతోంది.
రానాపై గౌరవం పెరిగిపోయిందని ఆమె చెబుతోంది. డి. సురేశ్బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.
కీలక పాత్రల్లో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేస్తున్న ఈ మూవీకి సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నాడు.