Advertisement

  • పది సినిమాలు రిలీజ్ అయినా ఈ కిక్కు రాదు ..మెగాస్టార్ తో వీడియోలో నటించడంపై కార్తికేయ ట్వీట్ ..

పది సినిమాలు రిలీజ్ అయినా ఈ కిక్కు రాదు ..మెగాస్టార్ తో వీడియోలో నటించడంపై కార్తికేయ ట్వీట్ ..

By: Sankar Fri, 17 July 2020 12:59 PM

పది సినిమాలు రిలీజ్ అయినా ఈ కిక్కు రాదు ..మెగాస్టార్ తో వీడియోలో నటించడంపై కార్తికేయ ట్వీట్ ..



కరోనా కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడటంతో స్టార్లు అందరు ఇంటి దగ్గరే ఉంటున్నారు ..అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన బాధ్యతగా మాస్క్ పెట్టుకోవడం గురించి ఒక వీడియో చేసి ప్రజలకు మాస్క్ పెట్టుకోవడం గురించి వివరించారు ..అయితే ఆ వీడియోలో మెగాస్టార్ తో పాటు యువ నటి నటులు అయిన కార్తికేయ , ఈషా రెబ్బ కూడా పాల్గొన్నారు ..

దీనితో ఆనందంతో పొంగిపోయిన హీరో కార్తికేయ.. చిరంజీవితో ఈ వీడియో చేయడం పట్ల తన ఫీలింగ్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ''కరోనా భయం, షూటింగ్స్ మిస్ అవ్వడం, నెక్ట్స్ ఎలా ఉంటుందో అని భయం అన్ని తీరిపోయాయ్.. ఈ ఒక్క వీడియోతో మెగాస్టార్ గారితో నేను కలిసి ఒక మంచి పని కోసం వీడియో చేయడం, నా సినిమాలు పది రిలీజైనా ఈ కిక్కు రాదు.. చిరంజీవి సర్‌తో మరో లైఫ్ టైమ్ మెమోరీ ఇది'' అని పేర్కొన్నాడు.

మరోవైపు చిరంజీవి సైతం ''నా ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు'' అంటూ కార్తికేయ, ఈషా రెబ్బాలకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఈషా.. ''నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సర్.. ఓ గొప్ప పని కోసం సినీ పరిశ్రమను ఆదుకునేందుకు సీసీసీ మన కోసం అనే సంస్థ ఏర్పాటు చేసి మమ్మల్ని అందర్నీ అక్కున చేర్చుకున్నారు'' అని పేర్కొంది.

Tags :
|

Advertisement