Advertisement

  • మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది...సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి ఇన్ స్టా పోస్ట్

మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది...సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి ఇన్ స్టా పోస్ట్

By: Sankar Sun, 14 June 2020 4:39 PM

మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది...సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి ఇన్ స్టా పోస్ట్



ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి సినీ పరిశమ్రకు కోలుకోలేని షాక్ తగిలింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

తన నటనతో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 3న చివరి సారిగా తన తల్లిపై ఇన్ స్టాగ్రామ్ లో కవితాత్మక పోస్ట్‌ ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని పోస్టులో రాశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి లోను చేస్తోంది. తన తల్లి ఫోటోను కూడా అతడు ఇనస్టాలో షేర్ చేశాడు. అయితే సుశాంత్ తల్లి 2002లో మరణించారు.

'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'డ్రైవ్'. దిల్ బేచారా అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సుశాంత్ ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

Advertisement