సింగిల్ లైఫ్ కు గుడ్ బై
By: chandrasekar Wed, 28 Oct 2020 10:00 PM
కాజల్ అగర్వాల్ గౌతమ్
కిచ్లూతో అక్టోబర్ 30న ఏడడుగులు
వేయనుంది. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసిన సింగిల్ లైఫ్ కు ఇంకా రెండు రోజులే
ఉందంటోంది కాజల్. ఈ విలువైన సమయాన్ని చెల్లెలు నిషాతో కలిసి సరదాగా గడిపేలా
ప్లాన్ చేసుకుంది.
ముంబైలోని నివాసంలో
నిషాతో సోఫాలో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మిస్ అగర్వాల్
కు ఇంకా రెండు రోజులే. ప్రతీ విషయాన్ని నా పార్ట్నర్ (నిషా) తో షేర్
చేసుకుంటూ.. అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది కాజల్.
బుధవారం కాజల్ హల్దీ, మెహెందీ
వేడుకలు జరుగనున్నాయి. సంగీత్ కార్యక్రమం అక్టోబర్ 29న జరుగనుంది. కరోనా పరిస్థితుల నేపత్యంలో కాజల్
తన పెళ్ళికి టాలీవుడ్ సెలబ్రిటీలెవరికీ ఆహ్వానం పంపనట్టు సమాచారం.
టాలీవుడ్ నుంచి కాజల్
పెళ్లికి హాజరయ్యే నటుడిని తానొక్కడినేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్.