మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...
By: chandrasekar Mon, 27 July 2020 8:12 PM
కొరటాల శివ దర్శకత్వంలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య అని తెలిసిందే. సోషల్
మెసేజ్తో వస్తోన్న ఈ చిత్రం దాదాపు సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ
సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోండగా రామ్ చరణ్, నిరంజన్
రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరో కీలక
పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉంది. ఈయనకు జోడిగా రష్మిక మందన నటించనుంది.
అది అలా ఉంటే ఈ మూవీ
నుండి వచ్చే నెలలో భారీ అప్డేట్ రానుందని సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజును
పురస్కరించుకొని ఆగస్టు 22న బిగ్ అప్డేట్ ఇవ్వనుంది చిత్రబృందం. ఆరోజునే ఆచార్య
మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనుందట చిత్రబృందం. అంతేకాదు వీలుంటే టీజర్ను కూడా
విడుదల చేసే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు శివ ఇప్పటికే కసరత్తు
మొదలుపెట్టాడట.
చిరంజీవి బర్త్డేని
ప్రతి ఏటా పండుగలా జరుపుకునే ఫ్యాన్స్కి ఆచార్య టీం అలా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని
చూస్తోందట. మరి ఇందులో ఎంత నిజముందనే విషయం తెలియాలంటే ఆరోజు వరకు ఆగక తప్పదు. ఈ
చిత్రం తర్వాత చిరంజీవి మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్లో
నటించనున్నాడు. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు.