మీమ్ స్తో అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్
By: chandrasekar Thu, 27 Aug 2020 8:56 PM
ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నామంటూ విరాట్అనుష్క శర్మ జంట శుభవార్త చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ట్విటర్లో విరాట్ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్గా దిగిన ఫోటోను షేర్ చేస్తూ.... 'ప్రస్తుతం నా భార్య గర్భవతి...త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే... ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్షిప్లో ది మోస్ట్ మొమరబుల్ మూమెంట్ ఇదే.. మేం త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అభిమానులు ఈ అందమైన జంటకు హార్టీ కంగ్రాట్స్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ శుభసందర్భంగా విరాట్ రియక్షన్ ఇలా ఉంటుందంటూ పలువురు మీమ్ మేకర్స్ ఇప్పటికే మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్లో విరుష్క మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక 2013 నుంచి రిలేషిన్షిప్లో విరుష్క జోడి... 2017లో డిసెంబర్ 11న ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు. అటు క్రీడారంగంలో విరాట్కు, ఇటు సినీ రంగంలో అనుష్కకు కోట్లాదిమంది అభిమానులున్నారు.