నితిన్ పెళ్లి సందడి షురూ ..వేడుకగా మెహేంది ఫంక్షన్
By: Sankar Fri, 24 July 2020 7:08 PM
హీరో నితిన్, షాలిని కందుకూరి వివాహం ఈనెల 26న హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఫలక్నుమా ప్యాలెస్లో జరగనుంది. వధూవరుల ఇంట ఇప్పటికే పెళ్లి సందడి మొదలైపోయింది. బుధవారం నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుకను నిర్వహించగా.. గురువారం మెహందీ ఫంక్షన్ను సందడిగా నిర్వహించారు.
నిశ్చితార్థ వేడుకకు సంబంధించి షాలినీకి ఉంగరం తొడుగుతున్న ఫొటోను ఇప్పటికే నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, మెహందీ ఫంక్షన్ ఫొటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లో నితిన్ నీలం రంగు కుర్తాలో మెరిసిపోతుండగా.. షాలిని ఎరుపు రంగు లెహెంగా వేసుకుని, డైమండ్ నెక్లేస్ ధరించి దేవతలా కనిపిస్తున్నారు. షాలినీతో తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన నీరజ కోన.. మిగిలిన ఫొటోలను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్నారు.
అయితే లాక్ డౌన్ కారణంగా కేవలం అతి కొద్దీ మంది బంధువులతో మాత్రమే వివాహం వేడుక జరగనుంది ..ఇటీవలే, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన నితిన్.. శుభలేఖ అందజేసి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే, తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కూడా నితిన్ ఆహ్వానం పంపినట్టు సమాచారం.