వైరల్ అవుతున్న రానా , రామ్ చరణ్ డబ్స్మాష్
By: Sankar Fri, 29 May 2020 6:33 PM
తెలుగు ఇండస్ట్రీ లో యువ హీరోల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంది ..అందులో ముఖ్యంగా చెప్పుకునే హీరోలు రామ్ చరణ్ , దగ్గుబాటి రానా .. వీరు ఇద్దరు స్కూల్ నుంచి క్లాస్మేట్స్ మాత్రమే కాక మంచి స్నేహితులు కూడా ..దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా రానా ప్రేమ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందిస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే లాక్డౌన్ సమయంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్ తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..
ఈ క్రమంలో రానా, చరణ్ లకు సంబంధించిన డబ్స్మాష్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మగధీర చిత్రంలోని ‘ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వందమందిని పంపు’అనే పవర్ ఫుల్ డైలాగ్కు వీరిద్దరూ డబ్ష్మాష్ చేశారు. 2015లో రానా తన ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘భైరవతో డబ్స్మాష్’ అంటూ కామెంట్ జత చేశాడు. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. విరాటపర్వం, అరణ్య సినిమాలో రానా ఫుల్ బిజీగా ఉన్నాడు.