Flash News: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి...!
By: Anji Sun, 11 Oct 2020 10:17 AM
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్లో తెలంగాణ హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దిశ (disha) పై అత్యాచారం, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్.. ఈ యథార్థ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ను సైతం వర్మ విడుదల చేశారు. ఈ క్రమంలో.. ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈరోజు తెలంగాణ హై కోర్ట్ ఒక్క నిబంధన ఇవ్వటం జరిగింది.. తెలంగాణ సేన్ సార్ బోర్డు కీ అటాచ్ చేయటం తో.. ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.