సౌండ్ సేమ్ అనిపిస్తే చాలు కాపీ అనేస్తున్నారు... మోహన్ కృష్ణ ఇంద్రగంటి
By: Sankar Thu, 10 Sept 2020 7:55 PM
ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన నాని 25 వ సినిమా వి మిశ్రమ ఫలితాలను సాధించింది..అయితే ఈ సినిమా కలంటే కూడా అదులో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎక్కవగా మాట్లాడుకుంటున్నారు..థమన్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు..ఆ సంగీతం రాక్షసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహా మరికొన్ని సినిమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను గుర్తు చేస్తోంది. దీంతో థమన్ మరోసారి కాపీ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై వి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు...
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్లు కూడా ఆల్రెడీ ఉన్న మ్యూజిక్నే వాడుతున్నారేంటి? అని అడిగారు. నిజానికి రాక్షసన్లో వచ్చే బీజీఎమ్, థమన్ వాడిన బీజీఎమ్ రెండూ ఒకేలా కనిపించినా అది వేర్వేరు. కాకపోతే మనవాళ్లకు సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో అందరూ కాపీ అంటున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు వేరే సినిమాల్లో కూడా సంగీత దర్శకులు కాపీ కొట్టకపోయినా వారిపై కాపీ నిందలు వేస్తారు.
అతను సితార్ వాడాడు.. ఇతను సితార్ వాడాడు.. అతను వయొలిన్ వాయించాడు, ఇతను వయొలిన్ వాయించాడు.. సౌండ్స్ సేమ్ అనిపిస్తే చాలు.. కాపీ అనేస్తారు. థమన్ ఎంతో ప్రతిభావంతుడు. అతను కాపీ చేయకపోయినా ఇంత గొడవ చేస్తున్నారు. అలాంటిది నిజంగా చేసుంటే ఊహించలేమేమో" అని ఇంద్రగంటి చెప్పుకొచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలను ఇంద్రగంటి ఖండించినందుకు తమన్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. సంగీత దర్శకులు కూడా ఇంత చక్కగా వివరణ ఇవ్వలేరని, లవ్యూ సర్.. అంటూ ట్వీట్ చేశాడు