Advertisement

  • మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

By: Sankar Fri, 14 Aug 2020 1:22 PM

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు


కరోనా కారణంగా పరిస్థితులు తలక్రిందులయ్యాయి. అన్ని రంగాలు కరోనా విలయతాండవానికి కుదేలయ్యాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అతలాకుతలమైంది. థియేటర్స్ మూతపడటం, సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఎందరో సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతున్నారు.

దీంతో ఆన్‌లైన్ తెరలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' కూడా ఓటీటీ వేదికపై రిలీజ్ కానుందని వార్తలు షికారు చేస్తుండటంతో ఆ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ మూవీ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గతంలోనే వార్తలు రాగా, వాటిని దర్శకనిర్మాతలు ఖండించారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా 'క్రాక్' మరోసారి ఓటీటీ వైపే చూస్తోందటూ వార్తల ప్రవాహం ప్రారంభమైంది. దీంతో సోషల్ మీడియాలో ద్వారా స్పందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదలవుతుందని.. ఓటీటీలో వచ్చే ఛాన్స్ లేదని అన్నారు.


Tags :
|

Advertisement