Advertisement

  • ముంబై వదిలి వెళ్లిపోయిన సుశాంత్ సింగ్ చివరి సినిమా హీరోయిన్

ముంబై వదిలి వెళ్లిపోయిన సుశాంత్ సింగ్ చివరి సినిమా హీరోయిన్

By: Sankar Thu, 02 July 2020 12:34 PM

ముంబై వదిలి వెళ్లిపోయిన సుశాంత్ సింగ్ చివరి సినిమా హీరోయిన్



సుశాంత్ మరణం నుంచి అతడి సన్నిహితులు ఇంకా బయటపడ్డట్లు కనిపించడం లేదు ..అకస్మాత్తుగా తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్కు గురి అయింది..నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడు అని చాల మంది విమర్శలు గుప్పించారు ..

అయితే సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బేచారా' లో నటించిన హీరోయిన్ సంజనా సాంఘి. సుశాంత్ ఆత్మహత్యతో ఆమె తీవ్ర బావోద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో... "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో... వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు కూడా" అంటూ పోస్ట్ చేసింది.

ఆమె మొదటిసారి హీరోయిన్ గా నటించిన చిత్రం దిల్ బేచారా ఓటిటి లో విడుదలవడం, సుశాంత్ మరణం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. సంజన సంఘి తొలిసారిగా రణబీర్ కపూర్ రాక్ స్టార్ సినిమాలో నటించింది.ఆ తర్వాత సుశాంత్ హీరోగా దిల్ బేచారా సినిమాలో తొలి సారి హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది ..అయితే అనుకోని పరిస్థితుల్లో లాక్ డౌన్ రావడం సినిమా హాల్స్ అన్ని మూత పడటంతో వెండి తెర మీద కనిపించే అవకాశం చేజారింది అని డిప్రెషన్లో ఉన్నట్లు తెలిసింది ..

Tags :
|
|

Advertisement