Advertisement

మహేష్ బాబుకు విలన్ ఎవరో తెలిసింది..!

By: Anji Mon, 28 Sept 2020 2:25 PM

మహేష్ బాబుకు విలన్ ఎవరో తెలిసింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఇక ఈ మూవీ లో విలన్ గా కన్నడ నటుడు ఉపేంద్ర ను అనుకున్నారట. కానీ ఉపేంద్ర డేట్స్ కుదరక నో చెప్పాడట. దీంతో ధృవ విలన్ అరవింద స్వామి ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడు..

వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అన్నదే మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

Tags :

Advertisement