పవన్ కళ్యాణ్ సినిమాలో రానా ఫిక్స్... షూటింగ్ ఈ రోజు నుంచే మొదలు...!
By: Anji Mon, 21 Dec 2020 4:18 PM
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్లో పవన్తో కలిసి నటించేందుకు రానా అంగీకరించాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు సోమవారం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా మొదలయ్యాయి.
దేవుళ్ల పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా, త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకునికి సినిమా స్క్రిప్ట్ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ అందజేశారు.
ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వెంకీ అట్లూరి వచ్చి, యూనిట్కు శుభాకాంక్షలు అందజేశారు. జనవరిలో సెట్స్ మీదకు వెళ్తామని చిత్ర నిర్మాత నాగవంశీ తెలిపారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు.
'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ను పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ చేసిన మాజీ హవల్దార్ పాత్రను రానా చేస్తున్నారు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది.