రానా నటించే 'విరాట పర్వం' షూటింగ్ లో కీలక షెడ్యూల్ పూర్తి
By: chandrasekar Wed, 02 Dec 2020 09:46 AM
దగ్గుపాటి రానా నటించే 'విరాట
పర్వం' సినిమా
షూటింగ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.
ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్లోకి
ఎంటర్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్తో కలిసి రానా ఒక వెబ్సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు. విరాటపర్వం
సినిమాలోరానా సరసన సాయి పల్లవి
కథానాయికగా నటిస్తోంది. నీదీ నాధీ ఒకే కథ చిత్రం దర్శకుడు వేణు ఈ చిత్రానికి
డైరక్షన్ చేస్తున్నాడు.
రానా నటించే ఈ
సినిమాను సురేష్ బాబు సమర్పణలో సురాకర్
చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇంతకుమునుపు విరాటపర్వం చిత్రం చిన్న షెడ్యూల్ షూటింగ్
పూర్తయినట్టు సమాచారం. దాంతో పాటు ఇటీవలే మళ్లీ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్
పూర్తయినట్టు సమాచారం. రాత్రి సమయంలో కొన్ని సీన్స్ అడవి మధ్యలో షూట్ చేస్తున్నట్టు
సమాచారం. ఈ మూవీలో రానా, సాయిపల్లవితో పాటు ప్రియమణి, నందితా
దాస్, నవీన్
చంద్ర, జరీనా
వహాబ్, ఈశ్వరీ
రావు, సాయిచంద్ తదితరులు నటిస్తున్నారు. రానా అభిమానులు ఈ
చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.