'వకీల్ సాబ్`లో శృతి హాసన్ నటించనుందనే వార్తలపై క్లారిటీ
By: chandrasekar Fri, 17 July 2020 11:28 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
రీ ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్`లో శృతి హాసన్ నటించనుందనే వార్తలపై క్లారిటీ
వచ్చేసింది. బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమా 'పింక్' మూవీకి రీమేక్గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు
హీరోయిన్స్తో పాటు శృతి హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందని గత కొన్ని
రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై
స్పందించిన శృతి తాను వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. ''అవును
నేను వకీల్సాబ్ మూవీలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే
చెప్పలేను'' అని తాజాగా ఓ మీడియా ముందు ఓపెన్ చేసింది శృతి హాసన్.
తాను విలన్ రోల్ పోషించేందుకైనా సిద్దమే అని, తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని ఈ సందర్భంగా శృతి
పేర్కొంది. అలాగే తన ఇంట్రెస్ట్ విషయమై రియాక్ట్ అవుతూ తాను పూర్తిగా సంగీతంపై దృష్టి
పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం నటన గురించే ఆలోచిస్తున్నానని తెలిపింది.
వకీల్ సాబ్లో శృతి హాసన్
నటిస్తుందని కన్ఫర్మ్ కావడం పవన్ అభిమానులను హుషారెత్తిస్తోంది. గతంలో ''గబ్బర్
సింగ్, కాటమరాయుడు'' సినిమాల్లో
నటించిన ఈ జోడీకి వకీల్ సాబ్ ముచ్చటగా మూడో సినిమా కానుంది. వేణు శ్రీరామ్
దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో
కనిపించనున్నారు. అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తుండగా సీనియర్ నటుడు
ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో
పవన్కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని టాక్.