సీఎం జగన్ ను కలవనున్న సినీ ప్రముఖులు
By: Sankar Tue, 09 June 2020 3:38 PM
కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలకు ఎక్కడిక్కడ ఆగిపోయాయి ..ముఖ్యంగా సినీ పరిశ్రమలో షూటింగ్లు అర్థాంతరంగా ఆగిపోయాయి ..ఇలా సినిమాలు మధ్యలో ఆగిపోవడంతో నిర్మాతలు , రోజు వారి కూలీలు బాగా ఇబ్బంది పడ్డారు..దీనితో ఇండస్ట్రీ లోని సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు ..దీనితో కెసిఆర్ తెలంగాణాలో షూటింగ్ లకు అనుమతి ఇచ్చాడు ..దీనితో ఆంధ్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరపడానికి విజయవాడ వెళ్లారు ..
వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్ రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్కు వెళ్లారు. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలవనుంది.
కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం వైఎస్ జగన్తో వారు చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.