అనన్య పాండే నటించిన ఖాళి పీలి చిత్రం నెపోటిజమ్ పై స్పందించిన తండ్రి చుంకీ పాండే
By: chandrasekar Wed, 26 Aug 2020 8:34 PM
సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజమ్ గురుంచి పెద్ద చర్చలే జరిగాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి తర్వాత నెపోటిమ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనన్య పాండే-ఇషాన్ ఖట్టర్ నటించిన ఖాళి పీలి చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా టీజర్ కు
4.2 మిలియన్ల వ్యూస్ తోపాటు
102 లైక్స్, 1.1 మిలియన్ల డిస్ లైక్స్ వచ్చాయి. చాలామంది ప్రేక్షకులు నెపోటిజమ్ కారణంగా సినిమా ట్రైలర్లపై డిస్ లైక్స్ చేస్తున్నారు.
ఈ సినిమాపై యాంటీ నెపోటిజమ్ గ్యాంగ్ నుంచి సెటైర్స్ చాలానే వచ్చాయి. దీనిపై అనన్యపాండే తండ్రి, సీనియర్ యాక్టర్ చుంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంటీ నెపోటిజమ్ గ్యాంగ్ నా కూతురిని స్టార్ కిడ్ గా పేర్కొనడం మొట్టమొదట నాకు సంతోషం కలిగించే అంశం. ఎందుకంటే వారి కామెంట్లు నన్ను పెద్ద స్టార్ గా అభివర్ణించాయి అంటూ నవ్వారు.
అయన మాట్లాడుతూ తన కూతురు అనన్యపాండేకు తన రికమండేషన్ తో తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటించే అవకాశం రాలేదని, టాలెంట్ తోనే ఆ ఛాన్స్ వచ్చిందని చుంకీ పాండే చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలినాళ్లలో చుంకీ పాండే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అనతి కాలంలో చాలామంది యాక్టర్లు నెపోటిజమ్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.