ఘనంగా క్రిస్మస్ వేడుకలని జరుపుకున్న మెగా ఫ్యామిలీ...!
By: Anji Fri, 25 Dec 2020 3:23 PM
క్రిస్మస్ వేడుకని టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు జరుపుకుంటూనే తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి.
గత రాత్రి రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహిచంగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది.
సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, చైతన్య, శిరీష్ ,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్ తదితరులు ఈ పార్టీలో సందడి చేయగా,అందుకు సంబంధించిన ఫొటోని శిరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కజిన్స్తో సీక్రెట్ శాంటా ఆడామని అన్నాడు. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.