బచ్చన్ జీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి ..ట్విట్టర్లో చిరంజీవి ఆకాంక్ష ..
By: Sankar Sun, 12 July 2020 10:15 AM
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ , అయన కొడుకు అభిషేక్ బచ్చన్ ఇద్దరు కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు , సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు ..అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ..అమితాబ్ బచ్చన్ కు కరోనా అని తెలియగానే ట్విట్టర్లో త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసాడు .. అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరు ట్విటర్లో పేర్కొన్నారు.
కాగా, తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అమితాబ్ శనివారం సాయంత్రం ట్విట్టర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు.
ఇక ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్థారణ అయినట్లు శనివారం అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కరోనా నెగెటివ్గా తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉండగా.. ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్ యూనిట్లో చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. తమ అభిమాన నటులు కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడాలని దేశవ్యాప్తంగా వారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ట్వీట్లలో సంఘీభావం తెలుపుతున్నారు.