Advertisement

వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి భేటీ

By: chandrasekar Wed, 10 June 2020 11:03 AM

వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి భేటీ

ఆంధ్ర ప్రదేశ్ లోనూ సినిమా, టీవీ షూటింగులకు అనుమతి లభించినట్లు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి నేతృత్వంలోని బృందం మంగళవారం భేటీ అయింది. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తెలంగాణలో జూన్ 15వ తేదీ నుంచి సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చారని, ఏపీలో సైతం అప్పటి నుంచే షూటింగులు చేసుకునేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారని వెల్లడించారు.

దీనికి సంబంధించి మార్గదర్శకాలకు మంత్రి పేర్ని నానితో సమన్వయం చేసుకోవాలని సూచించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవాలని గత ఏడాది కాలంగా అనుకుంటున్నామని, అది ఈరోజుకు కుదిరిందన్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి సాధించేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. విశాఖలో దివంగత ముఖ్యమంత్రి కేటాయించిన 300 ఎకరాల్లో తిరిగి పునరుద్ధరిస్తామని, అందులో స్టూడియోలు, పరిశ్రమ వృద్ధి చెందేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement