Advertisement

గవర్నర్ ను కలిసిన చిరంజీవి దంపతులు

By: Sankar Wed, 03 June 2020 3:43 PM

గవర్నర్ ను కలిసిన చిరంజీవి దంపతులు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి దంపతులు. నేడు (జూన్ 2) గవర్నర్ బర్త్ డే సందర్భంగా.. రాజ్‌భవన్‌లో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి విషెష్ అందించారు. తొలుత ట్విట్టర్ ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరు.. దేశసేవలో మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు చిరంజీవి. అనంతరం మంగళవారం మధ్యాహ్నం గవర్నర్‌ని కలిశారు చిరంజీవి. ఇటీవల సైరా చిత్రం రిలీజ్ సందర్భంగా గవర్నర్‌‌ని కలిశారు చిరంజీవి. సైరా సినిమా హిస్టరీని వివరిస్తూ సినిమా చూడాల్సిందిగా కోరారు చిరంజీవి.


chiranjeevi,telangana,governor,tamilasy,surekha , చిరంజీవి, సౌందర రాజన్‌,గవర్నర్‌‌, రాజ్‌భవన్‌,తెలంగాణ

ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్‌‌ పుట్టిన రోజు ఒకేరోజు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గవర్నర్ కొనియాడారు. తెలంగాణను సంపన్నమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనం విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. చిరంజీవి, కేసీఆర్‌‌లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Tags :

Advertisement